ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది జనసేన పార్టీ. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ ఉంటుందని పార్టీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు. 2 వేల మంది సభలో పాల్గొంటారని చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు రిప్లై ఇచ్చారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరిగే సభకు నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సభకు అనుమతి నిరాకరించారు శేరిలింగంపల్లి జోన్ డీసీపీ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
0
25
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


