10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు, మూడు రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 8వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు ఇచ్చారు. జూన్ 18న ఎన్నికలు ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
0
75
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


