ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు.. జ్యుడీషియల్‌ ఎంక్వైరీ- చంద్రబాబు

తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.

డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారని చంద్రబాబు సీరియస్‌ అయ్యరు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథ్‌రెడ్డిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై జ్యూడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.

టీటీడీ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయని… వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది… 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు.

Latest Articles

తగ్గిన గోల్డ్‌ ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌రేట్‌ 950...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్