21.7 C
Hyderabad
Saturday, February 8, 2025
spot_img

KTR: నేతన్నలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మన్నెగూడలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ…. 75 ఏళ్లు దాటిన చేనేతల కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని వెల్లడించారు. చేనేతలకు డిసిబిసి, టెస్కాబ్ ద్వారా రూ. 200 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చేనేతలు ఇంటి వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేస్తామన్నారు. చేనేతమిత్త పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3000 వేలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. చేనేతమిత్ర పథకం ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నేతన్నకు భీమా పథకం ద్వారా రూ, 5 లక్షల భీమా కల్పిస్తున్నమన్నారు. చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపి సేవలకు రూ. 25 వేలు ఇస్తామని కేటిఆర్ తెలిపారు. నేటినుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు అవుతుందన్నారు. రూ.40,50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటిఆర్ తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన నేత మోడీ అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందన్నారు.

Latest Articles

ఆడపిల్లలూ.. బూచోళ్లున్నారు జాగ్రత్త..!

మనుషుల మధ్య మృగాలు తిరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులు, మైనర్లు అని కూడా చూడకుండా తెగబడుతున్నాయి. మనిషి తోలు కప్పుకుని మృగంలా ఆడవాళ్ల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్