రైతు గోస – బీజేపీ భరోసాకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు కమలం నాయకులు వెళ్లి పరిశీలించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం చెందిదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం సేకరణ, రవాణా, మిల్లుల కేటాయింపు, డబ్బుల చెల్లింపులో సర్కారు విఫలమైందని అంటున్నారు. రేపు వికారాబాద్ తాండూరు మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఎల్లుండి సిద్దిపేట్ గజ్వేల్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల కొనుగోలు కేంద్రలకు వెళ్లనున్నారు. ఇక ఈనెల 27 న జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు బీజేపీ నేతలు. తమతో పాటు కొనుగోలు కేంద్రాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని డిమాండ్ చేశారు.
రైతు గోస – బీజేపీ భరోసాకు సిద్దమైన కమలం నేతలు
0
22
Latest Articles
కమీషన్లు, స్కామ్ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -
- Advertisement -


