సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. తాము 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నామని చెప్పారు. గుంటూరు మంగళగిరిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పథకాలన్నీ ముగింపేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకం అయినా గుర్తుకురాదన్నారు. చంద్రబాబూ.. సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.
మంగళగిరిలో జగన్ ఎన్నికల ప్రచారం
0
149
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


