న్యూఢిల్లీ: ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్లో రిలయన్స్ జియో రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాదిలో వీ2 పేరిట తీసుకొచ్చిన ఫోన్కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఇదే సిరీస్లో మరో రెండు మొబైల్స్ తీసుకొచ్చింది. జియో భారత్ వీ3, వీ4 పేరిట వీటిని పరిచయం చేసింది. 4జీ నెట్వర్క్కు సపోర్ట్ చేసేలా ఈ మొబైల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు జియో తెలిపింది. ఈ రెండు మొబైల్స్ ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. జియో స్టోర్స్తో పాటు ఇ -కామర్స్ ప్లాట్ఫారమ్లు జియోమార్ట్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు యాప్లు, ప్రీ-ఇన్స్టాల్ చేసిన సర్వీసులు కలిగి ఉంటాయి. ఇందులో జియో టీవీ, జియో సినియాలు, UPI చెల్లింపుల కోసం జియో పే వంటి యాప్స్ తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ఫోన్ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్ ఉచితంగా ఇస్తోంది. అంతేకాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో నెలపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా అదనంగా పొందొచ్చు. రెండు మొబైల్స్ 1000mAh బ్యాటరీతో వస్తున్నాయి. 128జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటాయి. 23 భాషలకు సపోర్ట్ చేసేలా వీటిని తీసుకొచ్చారు. జియో తక్కువ ధరలో అందించే జియో భారత్ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లతో దీన్ని రీఛార్జి చేసుకోవచ్చు.