29.6 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. సెంచరీతో చెలరేగిన ఖవాజా

అహ్మదాబాద్: బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగవ టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తైయ్యే సమయానికి ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బౌండరీలతో రెచ్చిపోయిన ఉస్మాన్​ ఖవాజా(Usman Khawaja) 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కామెరూన్​ గ్రీన్ 49పరుగులు చేసి అర్థసెంచరీక ఒక్క పరుగుల దూరంలో ఉన్నాడు. ఓపెనర్​ ట్రావిస్​ హెడ్ ​(32), కెప్టెన్ స్టీవెన్​ స్మిత్​(38) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లు మహ్మద్​ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్​ యాదవ్, జడేజా చెరో వికెట్​ తీశారు. ప్రస్తుతం ఖవాజా, కామెరూన్​ గ్రీన్​ క్రీజులో కొనసాగుతున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ(Narendra Modi) , ఆంటోనీ అల్బనీస్(Anthony Albanese​) ప్రత్యేక వాహనంలో స్టేడియం అంతా తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లకు క్యాప్​లు అందచేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75సంవత్సరాల స్నేహానికి గుర్తుగా.. ఇరు దేశాల ప్రధానులను బీసీసీఐ అధ్యక్షుడు​ రోజర్​ బిన్నీ సన్మానించారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్