విశాఖ వేదికగా మరికాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారుతాడేమోనని క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న వేళా.. నేడు ఎలాగైనా గెలుపును స్వంతం చేసుకోవాలని భావిస్తుంది.
టీమిండియా జట్టు: రోహిత్, గిల్, కోహ్లీ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, సిరాజ్.