మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్‌ షాపులు మూయించాలి – కిషన్‌ రెడ్డి

ఇందిరా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2 వేల 500 ఇస్తామన్న రేవంత్‌ ప్రభుత్వం.. వారికి 20 వేల రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4 వేల పింఛన్‌ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్‌ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్‌ షాపులు మూయించాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్