ఉమ్మడి ఖమ్మంలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి రైలులో బయల్దేరి రేపు ఉదయం 4.15కు కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడినుండి 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ అల్పాహారం సేవించి రోడ్డు మార్గంలో ఉదయం 8.40 గంటలకు భద్రాచలం రామయ్యను దర్శించుకుంటారు. 9.10కు వీరభద్ర ఫంక్షన్‌ హాలులో ‘గిరిజనుల ఆరోగ్యం’పై అవగాహన సదస్సుకు హాజరవుతారు. ఉదయం 11- 12 గంటల వరకు రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మరలా ఐటీసీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం 1.20 గంటలకు ఇల్లెందు లోని గెస్ట్ హౌస్ కి వచ్చి అక్కడినుండి 2.30కు ఖమ్మం ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. ఖమ్మంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో రైలెక్కి రాత్రి 10.35కి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్