- ఈనెల 19 నుంచి గోల్డ్ బాండ్ సబ్ స్క్రిప్షన్
- డిసెంబర్ 27 నుంచి గోల్డ్ బాండ్లు జారీ
పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బంగారాన్ని ఇష్టపడేవారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. గోల్డ్ బాండ్ సబ్ స్క్రిప్షన్ ను మరోసారి తీసుకువచ్చింది. ఈనెల 19 నుంచి గోల్డ్ బాండ్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులోకి వస్తుంది. మార్కెట్ రేటు కన్నా తక్కువకే బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కేంద్రప్రభుత్వం కల్పించింది. ఆన్ లైన్ లో కొంటే బంగారం రేటు మరింత తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాదిలో ఇదే చివరి విడత గోల్డ్ బ్యాండ్లు అని చెప్పవచ్చు.
డిసెంబర్ 23వరకు గోల్డ్ బాండ్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 27 నుంచి గోల్డ్ బాండ్లు జారీ చేస్తారు. దగ్గరలోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఒక గ్రాము నుంచి గరిష్టంగా నాలుగు కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తదుపరి విడత గోల్డ్ బాండ్లు వచ్చే ఏడాది మార్చిలో ఉంటాయి.