లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల మనోహర్ జోషికి గుండెపోటు రావడం తో ముంబై పిడి హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2023 మే నుంచి ఆయన ఆరోగ్యసమస్యల తో బాధపడుతున్నారు. ఏపీ వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్పుడు 2002 నుంచి 2004 వరకూ ఆయన స్పీకర్ గా ఉన్నారు. అంతకుముందు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. శివసేన కీలక నాయకుడైన మనోహర్ జోషి 1995 -1999 మధ్య మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశారు.