కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో పీసీ ఘోష్ కమిషన్ గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీ లు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరా లతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసిన ట్లు తెలిసింది.
కాళేశ్వరంపై కమిషన్ పొడిగింపు
0
218
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


