స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ‘ఈ-గరుడ’ పేరుతో ప్రయాణికులకు రేపటి నుండి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులను హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రవేశపెట్టనుంది. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రయాణించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మియాపూర్ లో రేపు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది.
రేపు తెలంగాణలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం
0
563
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


