స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ‘ఈ-గరుడ’ పేరుతో ప్రయాణికులకు రేపటి నుండి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులను హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రవేశపెట్టనుంది. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రయాణించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మియాపూర్ లో రేపు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది.
రేపు తెలంగాణలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభం
0
516
Previous article
Next article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


