ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి MLA అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటింకీ ఎన్నికలు ప్రచారంలో రోషన్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. దారి పొడవున ఆడపడుచులు నృత్యలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు మధుబాబు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


