ఒక రోజు విరామం తర్వాత ఇవాళ మళ్లీ ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మేమంతా సిద్దం పేరుతో చేస్తున్న బస్సు యాత్ర ఇవాళ ఐదో రోజు అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. కాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, NSP కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుం టారు.పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు.
నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
0
291
Previous article
Next article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


