25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

ముధోల్ మండల కేంద్రంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో చైన్ స్నాచర్లు హల్చల్ చేశారు. తానూర్ బైపాస్ రోడ్డు హనుమాన్ ఆలయం సమీపంలోని కాలనీకి చెందిన సుంకరి సుప్రియ అనే మహిళ ఇంటి బయట బీడీలు చేసుకుంటుండగా ఆమె మెడలో నుండి 3 తులాల బంగారన్నీ దుండగులు దొంగిలించారు. ఎవరికి అనుమానం రాకుండా బైక్‌పై వచ్చిన దుండగులు ఫోన్‌లో మాట్లాడినట్టు చేసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని గమనించి, ఎవరు లేరని తెలుసుకుని బీడీలు చేసుకుంటున్న మహిళ మెడలో నుండి బంగారాన్ని లాక్కొని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సంబంధిత సీసీ టీవీ ఫుటేజీని ముధోల్ సీఐ మల్లేష్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్