ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా.. దగా డీఎస్సీనా.. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి..పబ్లిసిటీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారని దుయ్యబట్టారు. స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేశారని.. డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. వివరాలను డేటా బేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. టాపర్ వివరాలను ఎందుకు తొలగించారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. టెట్ కన్వీనర్ను ఎందుకు తొలగించారని.. మంత్రి లోకేష్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైఎస్ జగన్ చెప్పారు.
డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలి- వైఎస్ జగన్
0
4
Latest Articles
తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా
తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయకుమార్ స్పీకర్ను కలిసి రాజీనామాలు సమర్పించారు. అనంతరం టీవీకే అధికార ప్రతినిధి ఆధవ అర్జున్ను ముగ్గురు ఎమ్మెల్యేలు కలిశారు. త్వరలోనే...
- Advertisement -
- Advertisement -


