ఈ పీఎస్ఎల్వీ సి-56 ప్రయోగం విజయవంతంపై సింగపూర్ ట్విట్ చేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తమ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడంతో భారత్-సింగపూర్ అంతరిక్ష భాగస్వామ్యంతో మరో మైలు రాయిగా నిలిచిందని సింగపూర్ ట్విట్ చేసింది. ఇంజనీరింగ్ మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహాల ప్రయోగం వల్ల సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇస్రో ప్రయోగం సక్సెస్ పై సింగపూర్ అభినందించింది. అయితే అంతరిక్షంలోకి దూసుకెళ్లిన 7 సింగపూర్ ఉపగ్రహాలు – ప్రైమరీ శాటిలైట్ DS-SAR, 6 సహ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలో చేరాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆదివారం తెలిపారు. ఈ విజయవంతంపై సింగపూర్ ట్విట్ చేశారు.
మరో మైలురాయి.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలతో నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56
స్వతంత్ర వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్త్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సి56 రాకెట్ను ప్రయోగించి విజయవంతం చేశారు. ఇందులో సింగపూర్కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి విజయవంతం చేశారు శాస్త్రవేత్తలు. అయితే మొత్తం నాలుగు దశల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు. వాణిజ్యానికి సంబంధించిన ఈ ఉగప్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్త్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సి56 రాకెట్ను ప్రయోగించి విజయవంతం చేశారు. ఇందులో సింగపూర్కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి విజయవంతం చేశారు శాస్త్రవేత్తలు. అయితే మొత్తం నాలుగు దశల్లో ప్రయోగాన్ని పూర్తి చేశారు. వాణిజ్యానికి సంబంధించిన ఈ ఉగప్రహాలను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది.
Latest Articles
- Advertisement -