33.2 C
Hyderabad
Monday, June 5, 2023

Chandrababu | వైసీపీ అరాచకాలను అడ్డుకుందాం.. ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. జగన్(Jagan)పాలనలో అరాచకాలు, ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సంకల్ప సిద్ధి స్కాం కేసులో వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేత పట్టాభి(Pattabi)పై దాడి చేయడం, అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni vamsi) ఆధ్వర్యంలోనే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని లేఖలో పొందుపరిచారు. దాడుల గురించి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆగడాలపై అందరం కలిసికట్టుగా పోరాడి రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకుందాం అని ప్రజలకు చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు.

 Read Also: రెండేళ్లలో సొంత ఇళ్లు కొంటామంటున్న భారతీయులు!

Latest Articles

ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశమంతటా కంటతడి పెట్టించింది. ఈ ఘటన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం జరిగింది. డుంగురి నుంచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్