26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్‌ సందర్భంగా విషాద ఘటన చోటు చేసుకుంది. ‘గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సమీపంలో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. శనివారం రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. వీరిద్దరూ కాకినాడకు చెందిన వారు.

గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ ముగిసిన తర్వాత ఇంటికి బయల్దేరారు. కాకినాడకు వెళ్తుండగా వీరి బైక్‌ను కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చరణ్‌ను కాకినాడ జీజీహెచ్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్