Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

నరేంద్ర మోడీ నాయకత్వానికి అగ్ని పరీక్ష !

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తో పోలిస్తే నరేంద్ర మోడీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1962లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మూడోసారి ప్రధానిగా ఎన్నికైనప్పుడు, దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే 1971లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు, ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు అధికారంలో లేవు. నరేంద్ర మోడీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నది ఆయన నాయకత్వానికి నిజంగా అగ్నిపరీక్షే.

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బెంగాల్, ఝార్కండ్‌, ఢిల్లీ, పంజాబ్‌ …ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్నాయి. ఇవి కాకుండా మూడు రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అన్ని రాష్ట్రాల్లోనూ నరేంద్ర మోడీ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నట్లే భావించాల్సి ఉంటుంది. దక్షిణాదిన గల కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో భారతీయ జనతా పార్టీకి నామమాత్రపు సీట్లు వస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట…ఈ నాలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రధానంగా సత్తా చాటాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే గడచిన ఐదేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్టలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 196 ఎంపీ సీట్లున్నాయి. వీటిలో 2019 ఎన్నికల్లో 170 సీట్లను బీజేపీ గెలుచుకుంది. పార్టీపరంగా కమలం పార్టీకి ఇది పెద్ద విజయమే. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఈ నాలుగు రాష్ట్రాలు అందించిన విజయంతోనే కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రాగలగింది.

2019 నాటికి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గడచిన ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని ముస్లింలంతా ఒక్కటయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముస్లింలు ,ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయాయి. ఈసారి దళితులు, ఆదివాసీలను కూడా తమ శిబిరం వైపునకు తిప్పుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ కూటమి తీవ్రంగా శ్రమించింది. బీహార్ విషయానికొస్తే, .2020లో బీజేపీ అండతో జేడీ యూ నాయకుడు నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2022లో బీజేపీ శిబిరంతో నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో జత కట్టి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. కాగా కిందటేడాది నితీశ్ కుమార్ మరోసారి బీజేపీ శిబిరంలో చేరారు. నితీశ్ కుమార్ పొలిటికల్ గా యూ టర్న్ తీసుకోవడం సగటు బిహారీలకు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ప్రభావం బీజేపీ అనుకూల ఓట్‌ బ్యాంక్‌పై పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటకలో 2019 ఎన్నికల్లో మొత్తం 28 సీట్లకు గాను బీజేపీ 26 సీట్లు గెలుచుకుంది. 2019 నాటికి కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలోని మెజారిటీ లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అక్కడి నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లపై ఉంది. దీంతో బీజేపీ ఈసారి 26 సీట్లు గెలుచుకోవడం అంత తేలికగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్టలో బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 2019 నుంచి 2023 మధ్యకాలంలో మారిన రాజకీయ పరిస్థితులు బీజేపీ ఓట్ల సంఖ్యను తగ్గిస్తాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్