బ్రేకింగ్: భార్య మరణాన్ని తట్టుకోలేక రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై

Jangaon | తెలంగాణలోని జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్యను జీర్ణించుకోలేక జనగామ ఎస్సై కాసర్ల శ్రీనివాస్(Jangaon SI Srinivas) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో పట్టణం అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. దంపతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా.. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య స్వరూప బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె మరణంతో మనోవేదనకు గురైన ఎస్సై శ్రీనివాస్ కూడా వెంటనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఎస్సై శ్రీనివాస్ ఇలా చనిపోవడం పోలీసులను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుటుంబ కలహాలే దంపతుల ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: గత సెప్టెంబర్ తర్వాత 5వేలు దాటిన కరోనా కేసులు

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్