కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గోపాలరావుపేటలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్రపరిణామాలకు దారితీసింది. భర్త అర్జున్కుమార్ తనను కొడుతున్నాడనే ఆరోపణతో భార్య దుర్గాభవాని బాత్రూంలో ఉపయోగించే యాసిడ్ను అతనిపై పోసింది. ఈ ఘటనలో అర్జున్ కుమార్కు గాయాలయ్యాయి. అర్జున్కుమార్ను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, దుర్గా భవాని అదే ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయిస్తామని భర్త బంధువులు డబ్బులు తీసుకుని మోసం చేశారని.. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనను కొడుతున్నాడని భర్తపై బాత్రూం యాసిడ్ పోసిన భార్య
0
54
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


