రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఘోరం జరిగింది. దైవాలగూడలో ఓ ఉన్మాది ఆరుగురిని చంపాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాధితురాలిని నిందితుడు చంపాడు. ఇంటి నుంచి చెరువు వద్దకు తీసుకెళ్లి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి నాగమ్మ, బాలిక నానమ్మ, తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చి నిందితుడు పరారయ్యాడు. ఉన్మాది రాజ్కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసులో మే 16న నిందితుడు రాజ్కుమార్ జైలుకెళ్లారు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చిన రాజ్కుమార్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మృతులు చిట్యాల రుక్కమ్మ, చిట్యాల లక్ష్మీ, బాలిక, సరిత, పరీక్షిత్, దైవిక్షిత్గా తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఘోరం.. ఆరుగురిని హత్య చేసిన ఉన్మాది
0
13
Previous article
Next article
Latest Articles
నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి
విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
- Advertisement -
- Advertisement -


