పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు

పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రి-కొడుకులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితులు శివకుమార్, అతని కుమారుడు శామ్యూల్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా కూడా విధించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2023 ఆగస్టు 10న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీ పనికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి 7 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. బాలికను పొరుగింటి శివకుమార్, అతని కుమారుడు తమ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది. తల్లిదండ్రులు ప్రశ్నించగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2023 ఆగస్టు 12న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కేసుపై పూర్తి విచారణ జరిగింది. మేడ్చల్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. డీసీపీ క్రైమ్స్ ఎ. ముత్యం రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

Latest Articles

టికెట్ విషయంలో వైసీపీ నాయకులు జగన్‌కు షరతులు పెడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అధిష్టానానికి అనూహ్యమైన షరతులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్