విజయన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత…ఈడీ అధికారుల కారుపై దాడి

కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టరు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి విజయన్‌ మద్దతు దారులు ఆయన ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. ఈడీ బృందం వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేయడంతో హింస చెలరేగింది.   తిరువనంతపురంలోని విజయన్‌ ఇంటి నుంచి ఈడీ బృందం బయటకు వచ్చిన తర్వాత, అధికారుల వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు పగులగొట్టారు. విజయన్ నివాసం బయట పార్టీ కార్యకర్తలు గుమిగూడి కేంద్ర దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను నియంత్రించి, ఉద్రిక్తత పెరగకుండా నిరోధించేందుకు పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ దాడిలో ఓ పోలీసులు గాయపడ్డాడు.

Latest Articles

కిలో మామిడి రూ.3లక్షలు.. కానీ అమ్ముకోవడం ఎలా?

ఒడిశాలోని ఒక రైతు కిలోకు రూ. 3 లక్షల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని పండిస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని తమస గ్రామంలో, దేబా పధియామి అనే రైతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్