తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గత ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 267 మంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనులు చేసే కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వడదెబ్బ బీభత్సం.. ఒక్కరోజే 45 మంది మృతి
0
3
Latest Articles
కరీంనగర్లో గాలివాన బీభత్సం.. కూలిన ఇళ్లు.. సాయం చేస్తామన్న బండి సంజయ్
నిన్న రాత్రి గాలి వాన భీభత్సానికి కరీంనగర్ లో పలు చెట్లు కూలిపోయాయి. బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో గాలివాన భీభత్సానికి ఇళ్లు ధ్వంసమయ్యాయి. వడ్డెర కాలనీలో గండికోట రాజేశ్ ఇల్లు...
- Advertisement -
- Advertisement -


