తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం.. వారు అధికారంలో ఉండగా జరుగుతున్నది ఏమిటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయని అన్నారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యానీ పట్టుబడింది అంటే టీటీడీ వైఫల్యం మరోసారి బుట్టదాఖలైందని విమర్శించారు.
మారణాయుధాలతో వచ్చినా పట్టించుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారని అన్నారు. టీడీపీ నాయకుల సేవలో టీటీడీ చైర్మన్ పనిచేస్తున్నారని.., భక్తులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ నాలుగు సార్లు పట్టుబడ్డారంటే.. 40 సార్లు తప్పించుకు తిరిగి ఉంటారని ఆరోపించారు.
లడ్డు ప్రసాదం విషయంలో తమపై నింద మోపారని.. తమపై నేరారోపణలు చేశారని మండిపడ్డారు. సనాతన హిందూ ధర్మం కోసం ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రశ్నించాలని పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలను భూమన కరుణాకర్ రెడ్డి కోరారు.


