లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడిలో కుట్రకోణం ఉందనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతలు కల్పించడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్న అరుణ.. కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని నిలదీశారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందన్నారు. కలెక్టర్ వెళ్లినపుడు ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఘటన జరిగినపుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నట్టు తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని ఫైర్ అయ్యారు.
లగచర్ల ఘటనపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
0
177
Previous article
Next article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


