25.3 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

జమ్మూకాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. జమ్మూకాశ్మర్‌లో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న హర్యానాలో ఎన్నికల జరగనున్నట్లు ఈసీ తెలిపింది. అక్టోబర్ 4న జమ్మూకాశ్మీర్, హర్యానా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో 90 స్థానాలకు.. హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్.సంధు నేతృత్వంలోని ఎన్నికల బృందం శ్రీనగర్‌లో పర్యటించింది. శ్రీనగర్‌లో అధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే జమ్మూకాశ్మీర్ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

చాలా కాలం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగడం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అంతేకాకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘంలో కదిలిక వచ్చింది. శ్రీనగర్‌లో పర్యటించి పరిస్థితుల్ని సమీక్షించారు. 20 జిల్లాల సీనియర్ పోలీసు అధికారులను, రాజకీయ పార్టీలతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం.. బీజేపీ నేతలు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరినట్లు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి తిరిగి ఎన్నికలు జరగలేదు. జూన్ 2018 నుంచి జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలనలో ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం దాని ప్రత్యేక హోదా కూడా ఆగస్టు 2019లో రద్దు చేయబడింది. దీన్ని జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్‌గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటి వరకు ఎన్నికల సంఘం మూడు సార్లు పర్యటించింది. అంతకుముందు 2019, 2024లో కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా సన్నాహాలు చేశారు. కానీ ఎన్నికలు మాత్రం జరగలేదు. అయితే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. గత నెలలో శ్రీనగర్ పర్యటనలో ప్రధాని మోడీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. దాని రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తానని ప్రకటించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్