జర్నలిస్ట్‌ పై సీఐ రాజేందర్‌ దాడి

ఓయూలో జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌పై సీఐ రాజేందర్‌ విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ చౌక్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేవారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని అఖిలపక్షం నాయకులు అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియా, మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ శ్రీ చరణ్‌పై దాడి చేసిన సీఐ ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్