25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

జర్నలిస్ట్‌ పై సీఐ రాజేందర్‌ దాడి

ఓయూలో జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌పై సీఐ రాజేందర్‌ విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ చౌక్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేవారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని అఖిలపక్షం నాయకులు అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియా, మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ శ్రీ చరణ్‌పై దాడి చేసిన సీఐ ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్