ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశా ల విద్యార్థులకు స్కూటీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేకపో యిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత కేసీఆర్ ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారని అన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నా రని విమర్శించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
0
296
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


