ఖమ్మం జిల్లా సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయంలో ఉద్యోగులు పెన్డౌన్ చేపట్టారు. దీంతో కార్యాలయం లో పనులు నిలిచిపోయాయి. హైదరాబాద్ జేటీసీ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడికి నిరసనగా వారు పెన్డౌన్ చేశారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై ఆటో యూనియన్ నాయకుడు చేసిన దాడికి నిరసనగా పెన్ డౌన్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ యోగీశ్వర్ జాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది పెన్డౌన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయటం అమానుషమన్నారు. ఇలాంటి చర్యలను తాము ఖండిస్తూ పెన్డౌన్ చేస్తున్నట్లు యోగీశ్వర్ జాదవ్ చెప్పారు.
సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయంలో ఉద్యోగుల పెన్డౌన్
0
244
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


