ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేసవి వడగాలులతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రతీ రోజూ దాదాపు 45 డ్రిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు జనజీవనానికి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది వడదెబ్బకు గురై ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల గిరిపై ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో తిరుమల కొండపై భక్తులు ఎండల తీవ్రవత నుండి కాస్త ఉపశమనం పొందారు.ఈ రోజు ఉదయం నుండి తిరుమల వాతావరణమంతా చల్లగా ఆహ్లాదకరంగా మారింది. అరగంట సేపు జోరుగా వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపో యింది. మరోవైపు, కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ, కింద తిరుపతిలో చుక్క చినుకు రాలిపడలేదు.
వర్షంతో చల్లబడిన తిరుమల
0
251
Previous article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


