భద్రాద్రి జిల్లాలో ఈ నెల 11న ప్రజాదీవెన సభ

     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో ఈ నెల 11న ప్రజాదీవెన సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర క్యాబినెట్‌ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించను న్నారని చెప్పారు. సీతారామచంద్ర స్వామిని దర్శించు కుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటార న్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా దీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్