భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో ఈ నెల 11న ప్రజాదీవెన సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించను న్నారని చెప్పారు. సీతారామచంద్ర స్వామిని దర్శించు కుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటార న్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా దీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఈ నెల 11న ప్రజాదీవెన సభ
0
254
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


