27.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

సోషల్‌ మీడియలో నాపై దుష్ప్రచారం- షర్మిల

        సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతుల కు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌ ఛానెళ్లు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని తెలిపారు. దాంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సోషల్ మీడియాలో తనపై.. తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని చెప్పారు. ఇవన్నీ నిరాధారమైనవే అయినా తనని అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్