మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో హైదరాబాద్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మేడారం జాతర సందర్భంగా TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి 1200 బస్సులను మేడారానికి కేటాయించింది. సగానికిపైగా బస్సులు లేకపోవడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేక బస్ స్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగా లకు , కాలేజీలకు వెళ్లేందుకు సైతం జనం అవస్థలు పడుతున్నారు. ఈనెల 25 వరకు మేడారం జాతర నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించకుండా ప్రభుత్వం మేడారం జాతరకు బస్సులను తరలించింది. ఇలా అయితే మరో ఐదు రోజుల పాటు ఇబ్బందులు తప్పవని అంటున్నారు అధికారులు.


