స్వతంత్ర, వెబ్ డెస్క్: లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఈ ఏడాది మార్చి 19న జరిగిన దాడి దృశ్యాలు ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ వెబ్సైట్ ( https://nia.gov.in/video-gallery.htm ) లో సీసీటీవీ ఫుటేజిని అధికారులు అప్లోడ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆ సీసీటీవీ ఫుటేజిని చూసి ఎవరినైనా గుర్తుపడితే తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గుర్తుపట్టినవారు +917290009373 నెంబర్కు వాట్సాప్ ద్వారా చెప్పాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.
లండన్లోని భారత రాయబార కార్యాలయంపై దాడి దృశ్యాలు విడుదల
0
269
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


