స్వతంత్ర, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈకేసు దర్యాప్తులో డిఈ రమేష్ కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ చేసేందుకు రమేష్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి 20 నుండి 30 లక్షలకు బేరం ఆడినట్లు తేలింది. దాదాపు 30 నుండి 50 మంది అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలింది. అడ్వాన్స్ టెక్నాలజీతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. పరీక్ష సెంటర్ల ఇన్విజిలేటర్స్ ను ట్రాప్ చేస్తున్నాడు. ఇన్విజిలేటర్లకు ముందుగానే డబ్బులు చెల్లించి పని సులువు అయ్యేందుకు పథకం రచించాడు.
పరీక్ష పేపర్ ఇచ్చిన ఐదు నిమిషాలకే రమేష్ వద్దకు పేపర్ చేరడాన్ని గమనించిన పోలీసులు విస్తుపోయారు. చాట్ జిపిటి ద్వారా జవాబులు తెలుసుకొని అభ్యర్థులకు చేరవేసినట్లు గమనించారు. పేపర్ లీక్ చేసేందుకు రమేష్ ముందుగానే రెక్కి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రమేష్.. పెద్దపల్లి లోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఈ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తన భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.