స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ధర్నా చేపట్టారు. కోట్ల రూపాయలు పెట్టి లైగర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామని.. ఇప్పుడు భారీగా నష్టాలు రావడంతో తాము రోడ్లమీదికి వచ్చామని ఆవేదన వెల్లడించారు. గతంలో లైగర్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పి.. ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం చెయ్యలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.
జూబ్లీహిల్స్లోని ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
0
457
Previous article
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


