స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం నియోజకవర్గం మల్లనూర్ గ్రామ పంచాయతీలోని జీడూరులో నివసిస్తున్న మహిళ ఉష (35) ఏనుగుల దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది. విషయం తెలుసుకున్న తమిళనాడు అటవీశాఖ అధికారులు.. తమిళనాడు నుండి కుప్పం అటవీ ప్రాంతానికి ఏనుగులను మళ్లించారు. ఏనుగుల గుంపు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించడంతో మల్లనూర్ పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.