26.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

చందనోత్సవంలో ప్రభుత్వ జోక్యం భక్తుల పాలిట శాపంలా మారింది: అశోక్ గజపతిరాజు

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ప్రభుత్వ జోక్యం భక్తుల పాలిట శాపంలా మారిందని ఆలయ అనువంశిక ధర్మకర్త, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వైఫల్యానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. ఈ మేరకు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ… తమ పూర్వికులనుండి ఆలయానికి వస్తున్నానని.. ఈ ఏడాది అంత దారుణం ఇంకెప్పుడు చూడలేదన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం వందల రూపాయల ఖర్చు చేసి టికెట్లు కొనుక్కున్న భక్తులు… ఆలయ నిర్వహణ చూసి మండిపడ్డారని అన్నారు. అధికారులేమో వీఐపీ దర్శనం చేసుకొని… మమ్మల్ని పట్టించుకున్నారా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా అప్పన్న దర్శనానికి వచ్చి ఆలయంలో పరిస్థితులు చూసి ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. ఇలాంటి చందనోత్సవం తన జీవితంలో ఎప్పుడు చూడలేనని అన్నారు. సిరిమానోత్సవం, రామతీర్థ ఉత్సవం, సింహాద్రి అప్పన్న చందనోత్సవం…ఇవన్నీ ప్రభుత్వం జోక్యం కారణంగానే నిర్వహణ లోపాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్