30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

ఏసీ పేలి.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడం(AC Blast)తో ఓ తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటకలోని రాయచూరు తాలూకాలోని శక్తి నగర్‌ కేపీసీఎల్‌ కాలనీలో వెలుగు చూసింది. ఈ హృదయ విదారక ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతులను రంజిత (33), పిల్లలు మృదుల (13), తరుణ్య (5)గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాండ్య వాసియైన సిద్దలింగయ్య స్వామి భార్యాపిల్లలతో కలిసి కేపీసీఎల్‌ కాలనీలో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. సిద్దలింగయ్య స్వామి శక్తినగర్‌ థర్మల్‌ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో కానీ విధి వక్రీకరించడం వల్ల సోమవారం షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికక్కడే సిద్దలింగయ్య భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఏసీలో పేలుడు సంభవించినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్