25.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

మహబూబ్ నగర్ జిల్లాలో… 16 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

అర్థరాత్రి ఆడవాళ్లు నిరభ్యంతరంగా వెళ్లినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీజీ చెప్పారు. కానీ నేటి సంఘటనలు చూస్తుంటే మనకి నిజమైన స్వాతంత్రం రాలేదనే అనుకోవాలి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. 16ఏళ్ల బాలికపై సొంత బాబాయ్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడమే కాదు, హత్య కూడా చేయడం అక్కడ సంచలనం సృష్టించింది. దీంతో గ్రామస్తులు దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. అక్కడే ఉన్న కారుకి నిప్పంటించారు.

బతుకు తెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుకుంటూ ఒక్కరే ఇంటిలో ఉంటోంది. అదును చూసుకుని బాబాయ్ శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి తనపై లైంగికంగా దాడి చేశారు. తను ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్