బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు సీఎం రేవంత్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న రామచందర్రావు గులాంగిరి పదానికి నిర్వచనం తెలుసుకోవాలన్నారు. ప్రధాని ముందు చేతులు కట్టుకుని నిలబడి గులాంగిరి చేస్తున్నది రాంచందర్రావే అని ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. మోదీ, అమిత్షా దగ్గర రాంచందర్రావు చప్రాసీలా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి పదవులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించలేని దద్దమ్మలు బీజేపీ నాయకులన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలన్నారు. రైతులపై బీజేపీ నాయకులది కపట ప్రేమ అని మండిపడ్డారు.
మోదీ, అమిత్షా దగ్గర రాంచందర్రావు చప్రాసీలా పనిచేస్తున్నారు – ఆది శ్రీనివాస్
0
54
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


