గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆనంది మోదీ అనే ఈ బాలిక గుజరాత్లోని జామ్ నగర్ నివాసి. వేసవి సెలవుల సందర్భంగా ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం భోజనం అంనతరం అక్కడే పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆటలో భాగంగా పరుగులు తీస్తుండగా ఒక్కసారిగా నేల మీద కుప్పకూలింది.
పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్ఎటాక్
0
58
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


