ఒకవైపు భూ కంపంతో అతలాకుతలమవుతోంది జాపాన్. ఇదిలా ఉండగా జపాన్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన జేఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. జపాన్ రాజధాని ట్యోకోలోని హనేడా విమా నాశ్రయం రన్ వే పై ఫ్లైట్ దిగుతుండా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఫ్లైట్ అంతా వ్యాపించాయి. ఈ విమానం హొక్కైడో విమానాశ్రయం నుంచి హనేడా విమానాశ్రయానికి చేరుకుంది.
ఈ దుర్ఘటనపై జపాన్ ఎయిర్ లైన్స్ సంస్థ అధికారులు విమాన ప్రమాద వివరాలను వెల్లడించారు. విమానం టోక్యో రన్ వే పై దిగుతున్న తరుణంలోనే అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొట్టినట్టు విమానాశ్రయ అధిరారులు భావిస్తున్నా మని, జాతీయ మీడియా ఎన్హెచ్కేకు తెలియజేశారు. ఇప్పటికీ ఫ్లైట్ లో మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో జేఎల్ 516 ఫ్లైట్ లో సిబ్బంది , ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారు అని హెన్ హెచ్ కే పేర్కొన్నట్టు జపాన్ టైమ్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు అనేది ఖచ్చితంగా తెలియదు.